Thursday, February 24, 2011

ముళ్ళపూడి

రావిశాస్త్రి,ముళ్లపూడి వెంకట రమణ ,కొడవటిగంటి, రంగనాయకమ్మలను చదువుతూ సాహిత్యవనంలోకి ప్రవేశించిన రోజులుమాకు అవి.గిరీశం లెక్చర్లు రాజకీయ భేతాళకథలు..అప్పుచేసే నేర్పుకథల్లో కన్నీటిని పన్నీటితో కలిపి పాఠకులను నవ్వుతూ కళ్ళుతుడుచుకునేలా చేసే అద్భుత కథకుడు వెంకటరమణ.బుడుగు రూపంలో ఎన్నెన్ని తరాల పిల్లల్లో ఆయన కనిపిస్తూనే వుంటాడు.మళ్ళీ ఒకసారి ఆ రచనల్ని కొత్త తరం పాఠకులకి పరిచయం చెయ్యడమే ఆయనకి నివాళి.